Header Banner

పాకిస్థాన్ ఒక విష సర్పం.. అబద్ధాలతే కాలం గడుపుతుంది! ఎంజే అక్బర్ తీవ్ర ఆగ్రహం!

  Sat May 31, 2025 17:43        India

విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్, పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశాన్ని ఒక విషసర్పంతో పోలుస్తూ, అబద్ధాలతో కాలం గడిపే, కపటనీతి కలిగిన పాక్‌తో చర్చలు జరపడం దాదాపు అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కోపెన్‌హాగన్‌లో ప్రవాస భారతీయులతో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, పాకిస్థాన్ విషయంలో భారత్ వైఖరిని ఆయన గట్టిగా సమర్థించారు.

ప్రస్తుతం బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని విపక్ష బృందంతో పాటు విదేశాల్లో పర్యటిస్తున్న ఎంజే అక్బర్, పాకిస్థాన్‌తో చర్చల ప్రస్తావనపై కీలక వ్యాఖ్యలు చేశారు. "కొంతమంది మిత్రులు పాకిస్థాన్‌తో భారత్ ఎందుకు చర్చలు జరపడం లేదని అడుగుతున్నారు. అసలు అక్కడ ఎవరితో చర్చలు జరపాలి? చిత్తశుద్ధి లేని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోని ప్రభుత్వం అక్కడ ఉంది. విషపు నాలుక కలిగిన ఆ ప్రభుత్వంతో మాట్లాడటం వల్ల ఎవరికి నష్టం?" అని అక్బర్ ప్రశ్నించారు. సర్పం ఎన్నడూ తన విషంతో తాను చనిపోదని, దాని విషం ఇతరులకే హాని చేస్తుందని ఆయన చురక అంటించారు.

ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్లో సమస్యలు..! అక్కడకు క్యూ, మీరు కూడా ఉన్నారా?


దేశంలో దీర్ఘకాలంగా నెలకొన్న అశాంతికి పాకిస్థానే ప్రధాన కారణమని ఎంజే అక్బర్ ఆరోపించారు. కేవలం సాకులుగా మారిన అంశాలపై చర్చల పేరుతో భారత్ తన విలువైన సమయాన్ని వృథా చేసుకోబోదని ఆయన తేల్చిచెప్పారు. చర్చల కోసం కేటాయించే సమయాన్ని కూడా పాకిస్థాన్ మరో ఉగ్రదాడికి ప్రణాళిక రచించుకోవడానికి వాడుకుంటుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ నోట వెలువడే చర్చల మాట కేవలం బూటకమని, అందులో ఎలాంటి నిజాయితీ లేదని అక్బర్ అన్నారు. అంతేకాకుండా, ఒకవేళ చర్చలు జరపాల్సి వస్తే, అవి కేవలం పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంపైనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అంతకుమించి వేరే అంశాలపై చర్చలకు ఆస్కారం లేదని అన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..



వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!


నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

భార‌త్‌లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్క‌డో తెలుసా?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #Andhrapravasi #MJAkbar #PakistanLies #IndiaPakistan #StrongStatement #VenomousSnake #TruthVsLies #IndiaFirst